Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ దుర్గగుడిలో కరోనా కలకలం, ఈవో సహా 18 మందికి పాజిటివ్

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:36 IST)
నిత్యం భక్తులతో కళకళలాడే విడయవాడ దుర్గ గుడిలో కరోనా కల్లోలం రేపుతుంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండున్నర నెలలకు పైగా గుడిని మూసివేసిన అధికారులు తాజాగా కేంద్రం ఆంక్షలు సడలింపుతో తిరిగి దర్శనాలు ప్రారంభించారు. అయితే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో వాటిలోను కోతలు పెట్టారు.
 
ఇదంతా సాగుతుండగా తాజాగా ఆలయ నిర్వహణాధికారి సరేశ్‌తో పాటు 18 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా నిర్వహించిన పరీక్షలో వీరికి వైరస్ సోకినట్లు నిర్థారించారు. ఇవాళ అసలే శ్రావణ శుక్రవారం కావడం, భక్తులు ఎక్కువగా ప్రత్యేక పూజలు కోసం తరలి వస్తుండటంతో కరోనా భయాలు మరింత పెరిగాయి.
 
ఇప్పటికే ఆలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దాఖలాలు కనిపిస్తున్నా భక్తుల రాక మాత్రం తగ్గలేదు. దీంతో అధికారులు కూడా తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. భక్తులను వెనక్కు పంపలేని పరిస్థితిలో దర్శనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అధికారులకు కరోనా సోకడంతో ఆలయాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించేటట్లు చర్యలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments