మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఆయన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ.. చెకింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లినపుడు నాకు ఈ రోజు COVID 19 అని వైద్యులు తేల్చారు.
గత వారంలో నాతో సంప్రదించిన వ్యక్తులను, దయచేసి స్వయంగా COVID-19 పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను అని వెల్లడించారు.