Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు లాక్‌డౌన్ తప్పదా : మంతనాలు జరుపుతున్న మోడీ?

Webdunia
శనివారం, 9 మే 2020 (10:12 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా, లాక్డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత పరిస్థితి మరింత ఎక్కువైంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది. అదేసమయంలో మృతుల సంఖ్య కూడా పెరిగింది. 
 
ముఖ్యంగా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కేసులు కేంద్రంతో పాటు.. స్థానిక ప్రభుత్వాలను హడలెత్తిస్తోంది. దీనికితోడు మద్యంకోసం మందుబాబులు సామాజిక భౌతిక దూరం మరచి ఎగబడుతున్నారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 
 
ఈ పరిస్థితిల్లో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాలన్న ఉద్దేశ్యంతో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులు, నిపుణులు, ఉన్నతాధికారులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్ 56342కు చేరగా, గత 24 గంటల్లో 3392 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 13 మంది చనిపోగా, మొత్తం చనిపోయిన మృతుల సంఖ్య 1880కు చేరాయి. ఒక్క శుక్రవారమే మహారాష్ట్రలో 1261 కేసులు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి తమిళనాడులోనూ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments