Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యంగ్ టైగర్ తీసుకున్న నిర్ణయాలు, వ్యక్తిగత సిబ్బంది కోసం ఏం చేసాడో తెలుసా?

యంగ్ టైగర్ తీసుకున్న నిర్ణయాలు, వ్యక్తిగత సిబ్బంది కోసం ఏం చేసాడో తెలుసా?
, శుక్రవారం, 8 మే 2020 (20:49 IST)
చక్కటి నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల పరంగానే కాకుండా తన అభిమానులు, ప్రజల పట్ల ప్రేమను చూపిస్తూ, సామాజిక సమస్యలపై స్పందిస్తూ అంతకు మించి మంచి పేరును తెచ్చుకున్నాడు.
 
ఒక్కో సినిమాకు మరింతగా పరిణితి చెందిన నటుడిగా ఎదుగుతూనే ఆపద సమయంలో తనను నమ్ముకున్నవారికి చేయూతనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనా కష్టాల నుండి సినీ కార్మికులను కాపాడటానికి సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) ఏర్పాటు చేసి, దానికి రూ. 25 లక్షల విరాళం అందించాడు, ఆ తర్వాత పరిశ్రమలోని హీరోలంతా కూడా దీనికి విరాళాలు ఇచ్చారు. దీనితో పాటుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విరాళం అందించాడు.
 
ఇక తన వద్ద పని చేస్తున్న వ్యక్తిగత సిబ్బందికి ఇప్పుడు మరో సాయం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన వద్ద నమ్మకంగా పని చేస్తున్న టీమ్ సభ్యుల యొక్క కుటుంబాల పూర్తి బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ ఉన్నంత కాలం వారి బాధ్యతలను తానే తీసుకుంటానని ప్రకటించాడు. వారి వేతనాన్ని పెంచడంతో పాటుగా రాబోయే రోజులలో వారికి ఏ ఆపద వచ్చినా తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ - పూజాహెగ్డే లుక్స్ అదుర్స్, ప్రభాస్ 20 సినిమా