జర్నలిస్టులపై కరోనా పడగ... నానాటికీ పెరుగుతున్న కేసులు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:19 IST)
కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పగబట్టినట్టుగా ఉంది. ఎందుకంటే.. గత మూడు రోజులుగా పలువురు జర్నలిస్టులు కరోనా వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. తొలుత ముంబైలోనూ, ఆ తర్వాత చెన్నైలో విలేకరులు ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో విధులు నిర్వహించాలంటేనే వారు వణికిపోతున్నారు. 
 
తాజాగా చెన్నై నగరంలో పనిచేసే మరో 10 మంది జర్నలిస్టులకు పాజిటివ్‌ తేలడంతో ఆందోళన నెలకొంది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పటికే 50 మంది జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు.
 
నిజానికి మంగళవారం ఓ ప్రైవేట్ టీవీలో పని చేసే విలేకరుల్లో 27 మందికి ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. తాజాగా మరో పది మందికి ఈ వైరస్ సోకింది. జర్నలిస్టులు వేగంగా వైరస్‌ బారిన పడుతుండడంతో మీడియా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. 
 
వారు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కార్యాలయాలకు వస్తే అక్కడి సిబ్బందికి ఎక్కడ విస్తరిస్తుందో అన్న ఆందోళన నెలకొంటోంది. అదే సమయంలో క్షేత్ర స్థాయి విధులు నిర్వహించే వారికి వైరస్‌ సోకకుండా ఏ చర్యలు చేపట్టాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments