Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 41,322 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక్కరోజే 485మంది మృతి

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (10:38 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 41,322 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110కు చేరింది. ఇందులో 4,54,940 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 87,59,969 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,36,200 మంది మరణించారు. 
 
కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 485 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కొత్తగా 41,452 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిపింది.
 
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గత 24 గంటల్లో 23 నుంచి 85 మంది బాధితులు చనిపోయారని పేర్కొంది. శుక్రవారం మహారాష్ట్రలో 6,185 కొత్త కేసులు నమోదవగా, ఢిల్లీలో 5,482 మంది కరోనాబారినపడ్డారు. రాష్ట్రంలో 98 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments