Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్షకు చేరిన కరోనా వైరస్ సంక్రమణ కేసులు.. భారత్‌లో 31

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (12:12 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఈ వైరస్ సోకుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రపంచంలోని 90 దేశాలలో కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. ఇక మృతుల సంఖ్య 3500కి పెరిగింది. 
 
చైనాలో ఇప్పటివరకు 80,552 కరోనా కేసులు నమోదుకాగా, ఇందులో 3,042 మంది మృతి చెందారు. చైనా బయట మొత్తం 17,571 కేసులు నమోదవగా.. అందులో వైరస్ కారణంగా 343 మంది మరణించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు సగానికి పైగా కోలుకున్నారు. భారతదేశంలో కరోనాతో బాధపడుతున్న రోగుల సంఖ్య శుక్రవారం(07 మార్చి 2020) నాటికి 31కి చేరుకుంది. 
 
చైనా తర్వాత కరోనా ఎక్కువగా ప్రభావితమైన దేశాలు దక్షిణ కొరియాలో 6,284 కేసులు, 42 మరణాలు నమోదుకాగా, ఇటలీ (3,858 కేసులు, 148 మరణాలు), ఇరాన్ (3,513 కేసులు, 107 మరణాలు), ఫ్రాన్స్ (423 కేసులు, ఏడు మరణాలు). గురువారం నాటికి, పాలస్తీనా మరియు భూటాన్లలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments