Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్.. చైనాలో తగ్గుతుంటే.. భారత్‌లో పెరుగుతున్నాయ్... (Video)

కరోనా వైరస్.. చైనాలో తగ్గుతుంటే.. భారత్‌లో పెరుగుతున్నాయ్... (Video)
, శుక్రవారం, 6 మార్చి 2020 (17:35 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇపుడు భారత్‌లో విజృంభిస్తోంది. ముఖ్యంగా, ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్న చైనాలోని వూహాన్ నగరంలో ప్రస్తుతం పరిస్థితి కుదుటపడుతోంది. అలాగే, చైనాలో కూడా నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువగా ఉంది. కానీ, భారత్‌లో మాత్రం ఈ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారంతో భారత్‌లో మొత్తం 31 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో ముగ్గురు కేరళ వాసులు మాత్రం చికిత్స పూర్తిచేసుకుని సురక్షితంగా ఇంటికి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రకటించారు. 
 
అలాగే, భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు తెలంగాణాలో నమోదైంది. ఆ తర్వాత ఢిల్లీ రెండు కేసులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏడు, రాజస్థాన్ రాష్ట్రంలో 17, కేరళలో మూడు కేసులు చొప్పున నమోదు కాగా, శుక్రవారం ఢిల్లీలో మరో కేసు నమోదైంది. దీంతో ఢిల్లీలో మొత్తం 3 కేసులు నమోదైనట్టయింది. 
 
కాగా, ప్రపంచ వ్యాప్తంగా 94,900 మందికి ఈ వైరస్ సోకగా, 3,272 మంది మృతి చెందారు. చైనాను మినహాయిస్తే 79 విదేశాల్లో 14,500 కేసులు నమోదు కాదు, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాల్లో రికార్డు స్థాయిలో 272 కేసులు నమోదయ్యాయి.

ఒక్క చైనాలోనే 80,400 మందికి ఈ వైరస్ సోకగా, మూడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 కారణంగా హుబెయ్ ప్రొవిన్స్‌లో డిసెంబరు నెలలో తొలి మరణం సంభవించింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

47 ఏళ్లైనా పెళ్లి కాలేదు.. 15ఏళ్లుగా మహిళతో ఆ లింకు.. కన్నతల్లి అడ్డుగా వుందని?