Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా పరుగు - లక్ష కేసులకు చేరువలో... దేశంలోనూ అంతే...

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:58 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. రాష్ట్రంలో కొత్తగా 1,967 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అదేసమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1781 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి చేరింది. ఆసుపత్రుల్లో 21,687 మందికి చికిత్స అందుతోంది. అలాగే, 76,967 మంది డిశ్చార్జ్ కాగా, మృతుల సంఖ్య మొత్తం 737కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 473 మందికి కొత్తగా కరోనా సోకింది. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,48,078 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 68,898 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 983 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,05,824కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 54,849కి పెరిగింది. ఇక 6,92,028 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 21,58,947 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments