Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అప్‌డేట్: దేశంలో పదివేల మరణాలు.. పదివేల కేసులు..

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (10:11 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా సోమవారం దేశ వ్యాప్తంగా 380మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 9900కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

ఇక, కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,667 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 3,43,091కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. 
 
మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,80,013మంది కోలుకోగా మరో 1,53,178మంది చికిత్స పొందుతున్నారు. కానీ దేశంలో వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.5శాతంగా ఉంది.
 
ప్రస్తుతం కేంద్రం మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఈ 8 రాష్ట్రాల్లో కరోనా కేసులు 10వేలకు పైగా ఉన్నాయి. ఇకపోతే.. తాజా మరణాల సంఖ్యతో బెల్జియంను దాటి భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానానికి చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments