న్యూయార్క్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఓ కరోనా రోగి మృతి

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:35 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం భయంతో వణికిపోతోంది. ఇప్పటికే అనేక దేశాలను సర్వనాశనం చేసిన ఈ వైరస్ మహమ్మారి దెబ్బకు ఇపుడు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. ముఖ్యంగా, న్యూయార్క్ మహానగరంలో మరింత భయానక పరిస్థితులు నెలకొనివున్నాయి. ఇక్కడ ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక కరోనా రోగి ప్రాణాలు కోల్పోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తి నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా పరిస్థితి విషమించి పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలను నిజం చేసేలా అమెరికాలో ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇప్ప‌టికే అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య 2.50 దాటిపోయింది. ఇక మరణాల సంఖ్య కూడా 8 వేలు మించిపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 60 వేల ప్రాణాల‌ను బ‌లిగొన్న ఈ మ‌హ‌మ్మారి.. అమెరికాలో శుక్రవారం ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఎంత‌లా అంటే న్యూయార్క్‌లో ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఒక వ్య‌క్తి చనిపోతున్నాడు. అయితే అక్కడ పేషంట్లకు సరిపోయేన్ని వెంటిలేటర్లు లేకపోవడమే ప్రధాన కారణమని అక్క‌డి అధికారులు చెపుతున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లోనే కరోనా వల్ల చనిపోయిన వారిసంఖ్య త్యధికంగా నమోదైందని పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments