Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఓ కరోనా రోగి మృతి

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:35 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం భయంతో వణికిపోతోంది. ఇప్పటికే అనేక దేశాలను సర్వనాశనం చేసిన ఈ వైరస్ మహమ్మారి దెబ్బకు ఇపుడు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. ముఖ్యంగా, న్యూయార్క్ మహానగరంలో మరింత భయానక పరిస్థితులు నెలకొనివున్నాయి. ఇక్కడ ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక కరోనా రోగి ప్రాణాలు కోల్పోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తి నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా పరిస్థితి విషమించి పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలను నిజం చేసేలా అమెరికాలో ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇప్ప‌టికే అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య 2.50 దాటిపోయింది. ఇక మరణాల సంఖ్య కూడా 8 వేలు మించిపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 60 వేల ప్రాణాల‌ను బ‌లిగొన్న ఈ మ‌హ‌మ్మారి.. అమెరికాలో శుక్రవారం ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఎంత‌లా అంటే న్యూయార్క్‌లో ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఒక వ్య‌క్తి చనిపోతున్నాడు. అయితే అక్కడ పేషంట్లకు సరిపోయేన్ని వెంటిలేటర్లు లేకపోవడమే ప్రధాన కారణమని అక్క‌డి అధికారులు చెపుతున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లోనే కరోనా వల్ల చనిపోయిన వారిసంఖ్య త్యధికంగా నమోదైందని పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments