Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు ఓరల్ ట్యాబ్లెట్లు - అనుమతించిన అమెరికా

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (11:22 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్టే వేసేందుకు వీలుగా వివిధ రకాలైన మందులను పలు డ్రగ్ కంపెనీలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు కరోనా వ్యాక్సిన్లను తయారు చేశాయి. ఇపుడు తాజాగా మాత్ర కూడా అందుబాటులోకి వచ్చింది. 
 
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో తొలిసారిగా కోవిడ్‌పై పోరాటానికి తొలి మాత్రను అనుమతి ఇ్చచింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఎఫ్‌డీఏ) తాజాగా కోవిడ్ పిల్‌కు ఆమోదముద్రవేసింది. కోవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ తయారు చేసిన టాబ్లెట్లకు అనుమతి లభించింది.  
 
కరోనాపై సాగుతున్న పోరాటంలో భాగంగా, ఇప్పటికే వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన ఫైజర్ కంపెనీ... తమ వ్యాక్సిన్లను అనేక ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అలాగే, చిన్నారులకు కూడా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తుంది. 
 
ఇపుడు పాక్స్‌లోవిడ్ (Paxlovid) పేరుతో కరోనాకు మాత్రలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మాత్రను, తయారీని పూర్తిగా విశ్లేషించిన ఎఫ్.డి.ఏ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments