దేశంలో 2,202 మందికి పాజిటివ్‌.. ఉత్తర కొరియాలో కరోనా విజృంభణ

Webdunia
సోమవారం, 16 మే 2022 (13:15 IST)
దేశంలో కరోనా నియంత్రణలో వుంది. గత 24 గంటల్లో 2.97 లక్షల మందికి వైద్య పరీక్షలను నిర్వహించగా 2,202 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 2,550 మంది కరోనా నుంచి కోలుకోగా... 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశంలో 17,317 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 5,24,241 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు 4,25,82,243 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక భారత్‌లో ఇంతవరకు 1,91,37,34,314 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
 
ఇకపోతే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ చైనా, ఉత్తర కొరియాల్లో కరోనా ప్రభావం అధికంగా వుంది. ముఖ్యంగా ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి విస్ఫోటం చెందింది. కఠిన లాక్ డౌన్‌లు పెట్టినా, క్వారంటైన్ రూల్స్‌ను అమలు చేసినా.. ఆ దేశంలోకి ఎంటరైన మూడు రోజుల్లోనే కేసులు లక్షలు దాటేశాయి. 
 
ఇప్పటిదాకా 8,20,620 కేసులు నమోదు కాగా.. బాధితుల్లో 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ మరో 15 మంది జ్వరం వల్ల చనిపోయారంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 42కు పెరిగింది. కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశమంతా లాక్ డౌన్ విధించింది 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments