Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 493 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:25 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 493 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాని ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,04,791కు పెరిగింది. మరో నలుగురు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 1,680కు చేరింది. తాజాగా 157 మంది డిశ్చార్జి అవగా ఇప్పటి వరకు 2,99,427 మంది కోలుకున్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 3,684 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 1616 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో 138 పాజిటివ్‌ కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే రికార్డయినట్లు పేర్కొంది. గత వారం రోజులుగా జీహెచ్‌ఎంసీలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 56,464 పరీక్షలు చేసినట్లు వివరించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments