Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 30 వేలకు తగ్గిన కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:26 IST)
గత కొద్ది రోజులుగా 40వేలకు పైగానే నమోదవుతోన్న కొత్త కేసులు ఒక్కసారిగా తగ్గాయి. ముందురోజు కంటే 24 శాతం క్షీణించి..30 వేలకు చేరాయి.

మృతుల సంఖ్యలో మాత్రం మార్పులేదు. అంతకుముందురోజు మాదిరిగానే 400పైగా మరణాలు వెలుగుచూశాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
 
తాజాగా 30,549 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.17కోట్లకు చేరాయి. కేరళ, మహారాష్ట్రలో కొత్త కేసులు భారీగా పడిపోవడమే ఈ తగ్గుదలకు కారణం. అక్కడ వరుసగా 13,984, 4,869 కేసులు బయటపడ్డాయి.
 
నిన్న మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు వైరస్‌ ధాటికి బలైనవారి సంఖ్య 4.25లక్షలుగా ఉంది. ఇటీవల క్రియాశీల కేసులు మళ్లీ నాలుగులక్షల మార్కును దాటాయి. ప్రస్తుతం 4,04,958 మంది కొవిడ్‌తో బాధపడుతన్నారు. క్రియాశీల రేటు 1.28 శాతంగా ఉంది. 
 
నిన్న 38,887 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.08కోట్లకు చేరగా.. ఆ రేటు 97.38 శాతంగా కొనసాగుతోంది. నిన్న 16,49,295 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 47,12,94,789కి చేరిందని ఐసీఎంఆర్ వెల్లడించింది.
 
అలాగే నిన్న 61లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 47,85,44,114కి చేరింది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments