Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కొత్తగా 41,831 కరోనా కేసులు

Advertiesment
corona cases
, ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:22 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదు కాగా.. 541 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
* నిన్న 17,89,472 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
 
* తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,24,351కి చేరింది.
 
* గడిచిన 24 గంటల్లో 39,258 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,08,20,521కి చేరింది.
 
* ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,10,952కు పెరిగి.. ఆ రేటు 1.30 శాతానికి చేరింది.
 
* దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే 60,15,842 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 47,02,98,596కి చేరింది.
 
* దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించింది. 46 జిల్లాల్లో 10%కి పైగా, 53 జిల్లాల్లో 5-10% మధ్య పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కొత్తగా 41 వేల పాజిటివ్ కేసులు