Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో..! తమిళనాడు సీఎం కార్యాలయ ఉద్యోగి కరోనాతో మృతి

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (13:37 IST)
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో ఇప్పటికే కరోనా బారినపడి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటన మరవకముందే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిలో ఒకరు కరోనా సోకి మృతి చెందినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 
 
కాగా సీఎం పళనిస్వామి పీఏగా పనిచేస్తున్న దామోదరన్‌ రెండు రోజుల క్రితమే కోవిడ్‌-19 లక్షణాలతో చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందతూ బుధవారం దామోదరన్‌ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సీఎం కార్యాలయంలో కరోనా భయం పట్టుకుంది. దామోదరన్‌తో పనిచేసిన వ్యక్తులకు కరోనా సోకిందా లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. 
 
ఇక చైన్నైలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ నెల 19నుంచి 12 రోజులపాటు మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఇప్పటివరకు 48,019 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 528మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే.. తమిళ రాష్ట్రంలో 1515 పాజిటివ్‌ కేసులు నమోదు, కాగా 49మంది మృత్యువాతపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments