Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనానికి వెళ్లి చేపల కూర తిని.. హాయిగా నిద్రపోయాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (13:18 IST)
దొంగతానికి వెళ్లి చేపల కూర తిని మస్తుగా నిద్రపోయిన ఓ దొంగను జనాలు ఉతికేశారు. చోరీకి వెళ్లి.. ఆకలేసిందో ఏమో కానీ ఆ దొంగ ఆ ఇంట్లో వండిపెట్టిన చేపలకూర తిని హాయిగా నిద్రపోయాడు. అంతే.. జనాలకు చిక్కాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లాలో సతీష్ అనే యువకుడు ఓ ఇంట్లో దొంగతనం చేయటానికి వచ్చాడు. 
 
ఏమేమీ నొక్కేద్దామా అనుకుంటూ ఇల్లంతా కలియతిరిగాడు. బంగారంగానీ.. విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. ఏమీ దొరక్కపోవడంతో..  వంటింట్లోంచి ఘుమఘుమలాడే చేపల పులుసు కూర వాసన వచ్చింది. పాపం.. నోరూరింది. ఆగలేకపోయాడు. కూర రుచిగా వుండటంతో కడుపు నిండా లాగించేశాడు. డాబా మీదకెళ్లి హాయిగా నిద్రపోయాడు. 
 
ఇంతలో ఇంటి యజమాని నిద్రలేచాడు. ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు చూసి దొంగతనం జరిగిందని భయపడిపోయాడు. ఇరుగు పొరుగు వారికి చెప్పాడు. దొంగ పారిపోయాడనుకుని సీసీటీవీ కెమేరాల పుటేజ్‌ను పరిశీలించారు.
 
చేపల కూరంతా తినేసి మేడమీదనుంచి దూకి పారిపోయి ఉంటాడని అనుకుంటూ.. మేడపైకి వెళ్లారు. అక్కడే నిద్రపోతున్న దొంగను చూసి షాకయ్యారు. ఆపై అతడ్ని లేపి.. చితకబాదారు. ఆపై పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments