Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌లో కొత్తరకం వేరియంట్.. పేరేంటో తెలుసా? ఎన్-440 రకం

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:49 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా చెలరేగిపోతున్న వేళ ఛత్తీస్‌గఢ్‌లో కొత్తరకం వేరియంట్ వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు వేర్వేరు నమూనాలను పరిశీలించిన అనంతరం ఈ వేరియంట్‌ను నిర్ధారించారు.
 
రోగులపై ఈ వేరియంట్ ఏమేరకు ప్రభావం చూపిస్తుందన్న విషయంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌కు N-440గా నామకరణం చేశారు. మనుషుల్లోని రోగ నిరోధకశక్తిని ఇది బలహీనం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
 
ఎన్-440 రకం వైరస్‌ ఉనికిని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల నిర్ధారించినట్టు చత్తీస్‌గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్‌దేవ్ తెలిపారు. అయితే, ఇది ప్రాణాంతకం కాదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బ్రిటిష్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 
 
కాగా, బుధవారం రాష్ట్రంలో కొత్తగా 4,563 కేసులు నమోదయ్యాయి. వైరస్ వెలుగుచూసిన రాష్ట్రంలో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అధికారులు తెలిపారు. అలాగే, నిన్న 39 మంది కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,170కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments