Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ వచ్చిన ఇంటికి వెళ్ళిన రోజా, ఆ తర్వాత ఏం చేశారంటే?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (18:55 IST)
అసలే కరోనా వైరస్. ఏ వైపు నుంచి.. ఎవరి దగ్గరి నుంచి ఈ వైరస్ సోకుతుందోనన్న భయం జనంలో ఉంది. అందుకే ప్రతి ఒక్కరు మాస్క్ లు వేసుకుని రోడ్లపై తిరుగుతున్నారు. ఇక కరోనా వచ్చిన వారి ఇళ్ళ దగ్గరకు వెళ్ళాలంటే ఎంత భయం ఉంటుంది. అటువైపుగా వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయినా, పిచికారీ చేసే మున్సిపల్ సిబ్బంది అయినా ఎవరైనా సరే చాలా సేఫ్టీగా వెళ్ళాలనుకుంటారు. 
 
అయితే నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన నియోజకవర్గంలో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండటం.. అందులోను ఢిల్లీ నుంచి వచ్చిన వారే కావడంతో నగరి ప్రజలు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రోజా మాత్రం ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. 
 
అయితే నిన్న వడమాలపేట మండలం వడమాలకు చెందిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో పారిశుధ్య కార్మికులతో పిచికారీ చేయాలని మున్సిపల్ అధికారులను రోజా ఆదేశించారు. అంతేకాదు ఆమే స్వయంగా రంగంలోకి దిగి రసాయనాలతో పాజిటివ్ రోగి ఇంటికి వెళ్ళి పిచికారీ చేశారు. ఆ యువకుడు నివాసమున్న చుట్టుప్రక్కల ప్రాంతంలో కూడా రోజానే స్వయంగా రసాయనాలతో పిచికారీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
 
ఆ తరువాత స్థానిక ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారెవరైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోమని కోరారు రోజా. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా రోజా స్వయంగా రసాయనాలతో పిచికారి చేయడంపై ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments