Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఫలితం... హస్తినలో తగ్గిన అత్యాచారాలు

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (18:28 IST)
కరోనా వైరస్ పుణ్యమాని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. అదీకూడా అత్యంత పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. అయితే, ఈ లాక్‌డౌన్ కామాంధులకు ఓ శాపంలా మారిపోయింది. ఫలితంగా అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ఈ అత్యాచారాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 
 
దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు 83 శాతం కేసులు తగ్గినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో కేవలం 23 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని తెలిపారు. గతేడాది అయితే ఈ సమయంలో 139 అత్యాచార కేసులు నమోదైనట్లు వివరించారు. 
 
మహిళలపై దాడుల కేసులు కూడా గణనీయంగా తగ్గినట్లు పోలీసులు వెల్లడించారు. 2019లో ఈ సమయంలో 233 కేసులు నమోదు అయితే ఇప్పుడు కేవలం 33 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. అత్యాచార కేసులు 83.4 శాతం తగ్గితే, మహిళలపై దాడుల కేసులు 85.8 శాతం తగ్గినట్లు ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. 
 
మహిళలపై అత్యాచారాలు, దాడులు తగ్గడానికి ప్రధాన కారణం ప్రజా రవాణాపై నిషేధం విధించడమే అని పోలీసులు తేల్చిచెప్పారు. పురుషులు మద్యం సేవించకపోవడంతో.. మహిళలపై దాడులు తగ్గాయన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. మహిళల వద్దకు పురుషులు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments