Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఫలితం... హస్తినలో తగ్గిన అత్యాచారాలు

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (18:28 IST)
కరోనా వైరస్ పుణ్యమాని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. అదీకూడా అత్యంత పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. అయితే, ఈ లాక్‌డౌన్ కామాంధులకు ఓ శాపంలా మారిపోయింది. ఫలితంగా అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ఈ అత్యాచారాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 
 
దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు 83 శాతం కేసులు తగ్గినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో కేవలం 23 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని తెలిపారు. గతేడాది అయితే ఈ సమయంలో 139 అత్యాచార కేసులు నమోదైనట్లు వివరించారు. 
 
మహిళలపై దాడుల కేసులు కూడా గణనీయంగా తగ్గినట్లు పోలీసులు వెల్లడించారు. 2019లో ఈ సమయంలో 233 కేసులు నమోదు అయితే ఇప్పుడు కేవలం 33 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. అత్యాచార కేసులు 83.4 శాతం తగ్గితే, మహిళలపై దాడుల కేసులు 85.8 శాతం తగ్గినట్లు ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. 
 
మహిళలపై అత్యాచారాలు, దాడులు తగ్గడానికి ప్రధాన కారణం ప్రజా రవాణాపై నిషేధం విధించడమే అని పోలీసులు తేల్చిచెప్పారు. పురుషులు మద్యం సేవించకపోవడంతో.. మహిళలపై దాడులు తగ్గాయన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. మహిళల వద్దకు పురుషులు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments