ఏపీలో కేసులు పెరుగుతున్నాయి.. జర జాగ్రత్తగా ఉండాలె : మంత్రి ఆళ్ళ నాని

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (17:19 IST)
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయనీ, అందువల్ల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ళ నాని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరిందని చెప్పారు. ఈ  కేసులో 140 మంది ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారని తెలిపారు. 
 
రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. సోమవారం నుంచి విశాఖలో కూడా ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురం ప్రాంతాల్లో ల్యాబ్‌లు పనిచేస్తుండగా, కొత్తగా గుంటూరు, కడప ప్రాంతాల్లో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 
 
ఇకపోతే, ఏపీలో తొలిసారి కలకలం రేగింది. రాష్ట్రంలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల మహిళ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మార్చి 17వ తేదీన ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా ఆమెకు కరోనా సోకింది. ఆమెను క్వారంటైన్‌కు పంపించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 
 
మరోవైపు తల్లి, కుమారుడితో కాంటాక్ట్‌లోకి వచ్చిన 29 మందిని క్వారంటైన్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఏపీలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించడంతో... విజయవాడ వాసులు హడలి పోతున్నారు. ఎంతమందికి వైరస్ సోకిందో అని ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments