Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీని వెనక్కి నెట్టిన అమెరికా-24 గంటల్లోనే 1,169 మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (17:12 IST)
ఇటలీ తర్వాత అమెరికాలో కరోనా కారణంగా మరణ మృదంగం మొదలైంది. అమెరికాలో ఈ మహమ్మారి కారణంగా కేవలం 24 గంటల్లోనే 1,169 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ కరోనా కారణంగా ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించలేదని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ ద్వారా మృతుల సంఖ్య వెల్లడైంది.

కాగా.. ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో ఇప్పటివరకు ఇటలీ(969) ముందుండగా.. ప్రస్తుతం ఆ స్థానంలోకి అమెరికా(1169) చేరింది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తంగా 6,095 మంది మృత్యువాత పడినట్లు అధికారులు చెప్తున్నారు.

అంతేగాకుండా తాజాగా దేశంలో కరోనా ధాటికి 2.40లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని తెలుపడం కలకలం రేపింది. దీన్ని బట్టి ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్య సేవలున్న అమెరికా కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

Anushka : అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments