Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలును భయపెడుతున్న కరోనా... పెరిగిపోతున్న కేసులు... ప్రజల్లో భయం

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (11:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను కరోనా వైరస్ భయపెడుతోంది. ఈ జిల్లాలో ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయానికి మరో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 82కు చేరగా, ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 386కు చేరింది. కర్నూలు తర్వాత గుంటూరు 58 కేసులతో రెండో స్థానంలో ఉంది. 
 
కొత్త‌గా న‌మోదైన ఐదు కేసులు కూడా ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారివేన‌ని అధికారులు తెలిపారు. జిల్లాలో కేసుల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఏపీలో శుక్రవారం కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 
 
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య గుంటూరులో ఏడు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో రెండు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరగా.. కర్నూలులో తాజా కేసులతో కలిపి ఆ సంఖ్య 386కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments