Webdunia - Bharat's app for daily news and videos

Install App

2న కరోనా టీకా డ్రై రన్‌ : ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే...

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (17:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫార్మా కంపెనీలు టీకాలను తయారు చేశాయి. వీటిలో కొన్నింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ టీకాలను అత్యవసర వినియోగం కింద భారత్‌లో కూడా పంపిణీ చేయనున్నారు. 
 
ఇందులోభాగంగా, వ్యాక్సిన్ పంపిణీ కోసం ముందస్తు ఏర్పాట్లకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా శనివారం డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అధ్యక్షతన గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు డ్రై రన్‌ విధివిధానాలపై చర్చించారు.
 
ప్రతి రాష్ట్రంలోని రాజధానిలో కనిష్ఠంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో డ్రై రన్‌ నిర్వహిస్తారు. వైరస్‌ తీవ్రత ఎక్కువ, రవాణా సౌకర్యం తక్కువగా ఉన్న పలు జిల్లాల్లోనూ డ్రైరన్‌ నిర్వహించనున్నారు. 
 
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో రాజధానుల్లోకాకుండా ఇతర ప్రధాన నగరాల్లో డ్రై రన్ నిర్వహించే అవకాశం ఉంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే గత నెల 28, 29న తొలి విడుత డ్రై రన్‌ కొనసాగిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

Nani 34: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం