Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ స్ట్రెయిట్ గురించి భయపడొద్దు, కానీ జాగ్రత్తలు తప్పనిసరి

కరోనావైరస్ స్ట్రెయిట్ గురించి భయపడొద్దు, కానీ జాగ్రత్తలు తప్పనిసరి
, బుధవారం, 30 డిశెంబరు 2020 (17:00 IST)
కొత్త కరోనావైరస్ స్ట్రెయిట్ గురించి ప్రజలు భయపడవద్దని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ప్రజారోగ్య అధికారులు, జన్యు శాస్త్రవేత్తలు, పరిశోధకులు కోరారు. కొత్త వేరియంట్ ప్రస్తుత కరోనాను మించినదనీ, మాస్కులు, భౌతిక దూరం పాటించినా వ్యాపిస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.
 
“ఈ సమయంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని కొనసాగించడం, సామూహిక సమావేశాలకు దూరంగా ఉండటం, సాధ్యమైనప్పుడల్లా చేతులను శుభ్రపరచడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వైరస్ కొత్త రూపును కలిగి ఉంది, కానీ మార్గదర్శకాలు మరియు జాగ్రత్తలు ఒకే విధంగా ఉండాలి. టీకాలు సాధారణ ప్రజలకు ఎప్పుడు లభిస్తాయో మాకు తెలియదు. కాని మాస్క్‌లు మరియు భౌతిక దూరం రూపంలో ఇప్పటికే సామాజిక వ్యాక్సిన్ ఉంది ”అని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) డైరెక్టర్ డాక్టర్ ఆర్కె మిశ్రా అన్నారు.
 
తెలంగాణలో మహమ్మారిని నియంత్రించడంలో భారీ పాత్ర పోషించిన జాగ్రత్తలు కొనసాగించేలా చూడాలని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలను కోరారు. "గత కొన్ని నెలల్లో, కోవిడ్ -19 యొక్క వ్యాప్తిని అరికట్టడంలో మేము చాలా విజయవంతం అయ్యాము. దానికి పెద్ద కారణం కొత్త సామాజిక నిబంధనలను స్వీకరించడంలో ప్రజల భాగస్వామ్యం. ముఖ్యంగా శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలను నేను కోరుతున్నాను” అని రాజేందర్ అన్నారు.
 
కరోనావైరస్ యొక్క ఉత్పరివర్తనలు లక్షణాలను లేదా వ్యాధి ఫలితాలను మరింత దిగజార్చలేదని సిసిఎంబిలో కరోనావైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ దివ్య తేజ్ సౌపతి అన్నారు. "ఉత్పరివర్తనలు టీకా అభివృద్ధికి ఆటంకం కలిగించవని మేము భావిస్తున్నాము. పరీక్ష ప్రోటోకాల్ కూడా అలాగే ఉంది. సమస్య ఏమిటంటే, కొత్త వేరియంట్ సులభంగానూ, వేగంగా వ్యాపిస్తుంది, ’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఏంటదో తెలుసా?