Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేటలో ఒకే ఫ్యామిలీలో 22 మందికి కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (17:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. 
 
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మృతి చెందగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్‌షిప్‌లో నివాసం ఉండే మృతుడి బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఓ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తగా పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా తేలిందని వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. బాధితుల్లో లక్షణాలేవీ కనిపించకపోయినా పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం యాదాద్రి టౌన్‌ షిప్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటిని సర్వే చేస్తున్నారు. బాధితులంతా హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఈ 22 మందితో కాంటాక్టుయిన మరో ఆరుగురికి సైతం పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తున్నది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments