Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన కేసు.. తల్లి నుంచి బిడ్డకు యాంటీ బాడీలు.. బొడ్డు తాడులో?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (18:08 IST)
అమెరికాలో కరోనా టీకా తీసుకున్న గర్భిణీ ఇటీవల ప్రసవించింది. దీంతో.. ఆ బిడ్డ శరీరంలో పుట్టుకతోనే కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా టీకా విషయంలో ఇటువంటి ఘటన జరగడం ప్రపంచంలోనే తొలిసారని వారు చెప్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన సదరు మహిళ హెల్త్ కేర్ వర్కర్‌గా సేవలందిస్తుంటుంది. ఏడెనిమిది నెలల గర్భంతో ఉన్నప్పుడు ఆమె మోడర్నా రూపొందించిన కరోనా టీకా తీసుకున్నారు. దీంతో.. తల్లి నుంచి బిడ్డకు కరోనా యాంటీబాడీలు బదిలీ అవుతాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
 
అయితే.. టీకా తీసుకున్న మూడు వారాలకు ఆమె బిడ్డను ప్రసవించింది. అయితే.. కాన్పు తరువాత బొడ్డు తాడులో యాంటీబాడీలను గుర్తించినట్టు వైద్యులు డా. పాల్ గిల్బర్ట్, డా. ఛాడ్ రడ్నిక్ పేర్కొన్నారు. గర్భిణులకు ఇతర టీకాల ఇచ్చాక తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీలు చేరుతాయి. 
 
కరోనా టీకా విషయంలోనూ ఇదే విధంగా జరుగుతుందని తొలిసారి బయటపడిందని చెప్పారు. అయితే.. ఈ యాంటీబాడీలు శిశువుకు కరోనా నుంచి రక్షణ నిస్తాయో లేదో తెలుసుకునేందుకు మరింత అధ్యయనం అవసరమని వారు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments