Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఓ కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా.. భారత్ మొత్తం 39 పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (11:14 IST)
కేరళలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తాకిన వారి సంఖ్య 39కి పెరిగింది. కేరళకు చెందిన ఈ ఐదుగురికి ఆదివారం పాజిటివ్ పరీక్షలు చేయడంతో భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 39కి పెరిగాయి. మూడు కొత్త కరోనావైరస్ కేసులలో, రెండు లడఖ్ నుండి, ఒకటి తమిళనాడు నుంచి నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరి ఆరోగ్యం నిలకడగా వున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో కేరళలోని ఓ కుటుంబం కరోనా వ్యాపి చెందినా ఆరోగ్య శాఖకు తెలియజేయకపోవడం, డాక్టర్ల వద్దకు వెళ్లకపోవడంతో ఈ కరోనా సులభంగా ఇతరులకు సోకింది. కేరళ, పత్తినంతిట్టకు చెందిన ఓ కుటుంబానికి కరోనా సోకిందని కేరళ మంత్రి శైలజ వెల్లడించారు. ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురు.. కేరళలోని ఇద్దరు బంధువులను కలిశారు. వీరు కరోనా పరీక్షలకు విమానాశ్రయంలోనే సహకరించలేదని తెలుస్తోంది. కేరళకు వచ్చి మరో ఇద్దరు వృద్ధులైన ఇద్దరు బంధువులను కలిశారు. వారికి కూడా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారిని ఇసోలేషన్‌కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కరోనా వ్యాప్తిపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాకు తగినంత నిర్బంధ సదుపాయాల కోసం స్థలాలను గుర్తించాలని, వ్యాధి మరింత వ్యాప్తి చెందితే క్లిష్టమైన సంరక్షణ కోసం సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments