Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఓ కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా.. భారత్ మొత్తం 39 పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (11:14 IST)
కేరళలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తాకిన వారి సంఖ్య 39కి పెరిగింది. కేరళకు చెందిన ఈ ఐదుగురికి ఆదివారం పాజిటివ్ పరీక్షలు చేయడంతో భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 39కి పెరిగాయి. మూడు కొత్త కరోనావైరస్ కేసులలో, రెండు లడఖ్ నుండి, ఒకటి తమిళనాడు నుంచి నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరి ఆరోగ్యం నిలకడగా వున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో కేరళలోని ఓ కుటుంబం కరోనా వ్యాపి చెందినా ఆరోగ్య శాఖకు తెలియజేయకపోవడం, డాక్టర్ల వద్దకు వెళ్లకపోవడంతో ఈ కరోనా సులభంగా ఇతరులకు సోకింది. కేరళ, పత్తినంతిట్టకు చెందిన ఓ కుటుంబానికి కరోనా సోకిందని కేరళ మంత్రి శైలజ వెల్లడించారు. ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురు.. కేరళలోని ఇద్దరు బంధువులను కలిశారు. వీరు కరోనా పరీక్షలకు విమానాశ్రయంలోనే సహకరించలేదని తెలుస్తోంది. కేరళకు వచ్చి మరో ఇద్దరు వృద్ధులైన ఇద్దరు బంధువులను కలిశారు. వారికి కూడా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారిని ఇసోలేషన్‌కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కరోనా వ్యాప్తిపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాకు తగినంత నిర్బంధ సదుపాయాల కోసం స్థలాలను గుర్తించాలని, వ్యాధి మరింత వ్యాప్తి చెందితే క్లిష్టమైన సంరక్షణ కోసం సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments