Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగని కరోనా విజృంభణ! షాద్ నగర్ డివిజన్లో నేడు 30 పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 13 జులై 2020 (21:20 IST)
కరోనా మహమ్మారి ఆగకుండా విజృంభిస్తోంది. ఈ ఒక్కరోజే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్లో 30 పాజిటివ్ కేసులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ గణాంకాలతో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.
 
డివిజన్లో మొత్తం ముప్పై కరోనా పాజిటివ్ కేసులు ఈ ఒక్కరోజే నమోదు కావడం గమనార్హం. అయితే ఇందులో పట్టణంలోనే 20 పాజిటివ్ కేసులు ఉండటం గమనార్హం. చాలా కాలనీల్లో ఇది విస్తరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే సుమారు గణనీయంగా బాధితుల సంఖ్య పెరిగింది. ఈ ఒక్కరోజే 30 కేసులు నమోదు అయితే పరిస్థితి ఇంకా ముందు ఏ విధంగా ఉంటుందో వేరేగా చెప్పనక్కర్లేదు.
 
ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించేందుకు కొన్ని వ్యాపార సంస్థలు ముందుకు వచ్చాయి. ఇది అభినందనీయం కానీ ఇదే కోవలో స్వచ్ఛందంగా ముందుకు అన్ని వ్యాపార సంస్థలు వస్తే ఫలితం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. లేకపోతే కరోనా విజృంభణ ఇప్పట్లో ఆపడానికి వీలు కూడా లేకుండా పోతుంది. ప్రస్తుతం పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభించింది.. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ చేసుకుంటే మేలు షాద్ నగర్ ప్రజలారా పారా హుషార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments