Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోటిన్నర దాటిన కరోనా కేసుల సంఖ్య - యాక్టివ్ కేసులు 2.27 లక్షలు

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (11:01 IST)
దేశంలో మొత్తం కరోనా కేసులో కోటిన్నర దాటాయి. గడచిన 24 గంటల్లో మరో 18088 మందికి కరోనా సోకినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది. అదేస‌మ‌యంలో 21,314 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,74,932కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 264 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,50,114కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,97,272 మంది కోలుకున్నారు. 2,27,546 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటివరకు మొత్తం 17,74,63,405 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,31,408 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 417 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 472 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,410కి  చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,81,872 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,556కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,982మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,748  మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments