Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒమిక్రాన్ దూకుడు.. ఐదో స్థానంలో తెలంగాణ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (08:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రోజు ఏకంగా పది ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు... కొత్త ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతున్నట్టు గుబులు రేకెత్తిస్తుంది. ముఖ్యంగా, ఒకే రోజు ఏకంగా 10 కేసులు వెలుగు చూడటం ఇపుడు అధికారుల్లో గుబులు పుట్టిస్తుంది. 
 
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు ఈ నెల 12వ తేదీన వెలుగు చూసింది. ఆ తర్వాత గత 17 రోజుల్లో ఈ కేసుల సంఖ్య 16కు చేరుకుంది. అయితే, ఒకేఒక్క రోజు ఏకంగా 10 కేసులు నమోదు కావడం ఈ వైరస్ తీవ్రతను చూసిస్తోంది. ఈ పది మంది బాధితుల్లో ఏడుగురు విదేశాల నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. మరో ముగ్గురు వీరి కాంటాక్ట్ కేసులుగా అధికారులు గుర్తించారు. 
 
ఐదో స్థానంలో తెలంగాణ
మరోవైపు, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఒమిక్రాన్ కేసుల్లో దేశంలోనే ఐదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్రలు పోటీపడుతున్నాయి. ఇపుడు తెలంగాణలో కూడా ఆ స్థాయిలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే ఏకంగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకరు ల్యాబ్ టెక్నీషియన్, ఓ గర్భిణి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments