Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రొట్టెలు మృదువుగా వుండాలంటే?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:57 IST)
గృహిణులు వంటింట్లో అడుగు పెట్టి రుచికరమైన వంటకాన్ని తయారుచేసేందుకు తిప్పలు పడుతుంటారు. కొన్నిసార్లు అనుకున్నదానికంటే ఎక్కువ పాళ్లలో దినుసులు వేయడమో, లేదంటే కారం ఎక్కువగా వేయడమో చేసి పదార్థం రుచి దెబ్బతింటుందని బాధపడుతుంటారు. కొన్ని సమయాల్లో కొన్నింటిని ఇలా అధిగమించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
పసుపు ఎక్కువైతే
కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే, అది ఎక్కువగా ఉన్న పసుపును పీల్చేసుకుంటుంది.
 
గోధుమ రొట్టెలు
గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా వస్తుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. 
 
పన్నీరు కలపాలి
గులాబ్ జామూన్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు, ఆ పిండిలో కాస్తంత పన్నీరు కలపాలి. ఇలా చేయడం వల్ల జామూన్‌లు నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి.
 
ఇడ్లీలు మృదువుగా
ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే... ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి.
 
కాకరకాయ కూర
కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయాలి. అలా చేస్తే చేదు తగ్గడమే కాకుండా, కూరకు కొత్త రుచి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments