Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన చెన్నై విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబరు ఒకటో తేదీన ఆరోగ్య శిబిరం

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (16:21 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకరైన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబరు 2వ తేదీ)ను పురస్కరించుకుని సెప్టెంబరు 1వ తేదీన జనసేన పార్టీ చెన్నై విభాగం ఆధ్వర్యంలో "మెగా హెల్త్ క్యాంపు - బ్లడ్ డొనేషన్ డ్రైవ్" జరుగనుంది. స్థానిక టి.నగర్‌లోని ఆంధ్రా క్లబ్‌లోని గోదావరి హాలులో ఈ మెగా ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిర కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగే ఈ మెగా శిబిరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. 
 
రక్తదాన శిబిరంలో ఆసక్తిగల వారు పాల్గొని రక్తదానం చేయొచ్చు. ఆరోగ్య శిబిరంలో నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన పలు విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయడమేకాకుండా, తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. అందువల్ల ఈ ఆరోగ్య శిబిరాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని జనసేన పార్టీ చెన్నై విభాగం కన్వీనకర్ తమ్మయ్య నాయుడు ఓ పత్రికా ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాల కోసం 98402 82445 అనే నంబరులో సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments