Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో మసాజ్ సెంటర్లలో సోదాలు... మహిళలు అరెస్టు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (08:55 IST)
ఇటీవలి కాలంలో చెన్నై మహానగరంలో కూడా మసాజ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతి లేకుండా ఈ సెంటర్లను ప్రారంభిస్తున్నారు. ఇలాంటి కేంద్రాల్లో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఇలాంటి కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అనేక మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇటీవల వ్యభిచార నియంత్రణ విభాగంలో పనిచేసే ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వీరిద్దరూ చెన్నై నగరంలోని మసాజ్ సెంటర్లు, స్పాలు, స్టార్ హోటళ్ళ నుంచి లక్షలాది రూపాయలను లంచంగా తీసుకుంటున్నట్టు తేలింది. దీంతో గత రెండు రోజులుగా ప్రత్యేక బృందాలు మసాజ్ సెంటర్లు, స్పాలపై దృష్టిసారించి ఆకస్మిక తనిఖీలు చేశారు.
 
ఈ తనిఖీల్లో పలు మసాజ్ సెంటర్లు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు, మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆ సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈ కేంద్రాల్లో మసాజ్ చేసేందుకు నియమించుకున్న 8 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ప్రస్తుతం చెన్నైలో మొత్తం 151 మసాజ్ సెంటర్లు ఉండగా, వీటిలో 63 సెంటర్లకు అనుమతులు లేవని తేలింది. దీంతో ఈ సెంటర్ల నిర్వాహకులకుపై పోలీసులు కేసులు నమోదు చేసి సీలు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments