Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని... బాధతో అది కోసుకున్న భర్త

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (14:51 IST)
తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, తనకు పిల్లలు పుట్టడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నైలో వాషర్‌మేన్ పేటలో బాబు, దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. 
 
బాబు వయసు 40 సంవత్సరాలు. దేవి వయసు 35 ఏళ్లు. వారికి పెళ్లి జరిగి పదేళ్ళు అయినా ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో బార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బాబుకు మద్యం తాగే అలవాటు ఉంది. దీనిపై కూడా గొడవలు తరచూ జరుగుతూ ఉండేది. ఈ గొడవ కాస్త చాలా పెద్దదైంది. దీంతో గత శుక్రవారం మరోసారి గొడవ జరిగింది. భర్తతో విసిగిపోయిన దేవి అతడిని వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
తన భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, మరోవైపు తనకు పిల్లలు పుట్టడం లేదన్న ఆవేదనతో రెండు రోజుల పాటు పూటుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఉన్న బాబు ఆదివారం కిచెన్ లోకి వెళ్లి కత్తి తెచ్చుకుని తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. అయితే, ఆ నొప్పికి తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తుండగా, ఇరుగుపొరుగు వారు వచ్చి అతడిని పరిశీలించి అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments