టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆ రాష్ట్ర  విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు విజయఢంకా మోగించారు. 
 
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన గురుకుల పాఠశాల విద్యార్థులు, గురువారం విడుదలైన టెన్త్ ఫలితాల్లో కూడా అత్యధికగా 99.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఉత్తీర్ణతా శాతం 75.68 శాతంగా ఉంది. 
 
మరోవైపు, ఆగస్టు ఒకటో తేదీ నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్  సిప్లమెటరీ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ పరీక్షలు 10వ తేదీ వరకు జరుగుతాయని చెప్పరారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు నిర్వహించనున్నట్టు చెప్పారు. పది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చే నెల 18వ తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించి ఈ పరీక్షలు రాయొచ్చని వివరించారు. 
 
అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల టైం టేబుల్‌ను పరిశీలిస్తే, 
ఆగ‌స్టు ఒకటో తేదీన ఫ‌స్ట్ లాంగ్వేజ్
ఆగ‌స్టు రెండో తేదీన సెకండ్ లాంగ్వేజ్
ఆగ‌స్టు మూడో తేదీన థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
ఆగ‌స్టు నాలుగో తేదీన మ్యాథ‌మేటిక్స్
ఆగ‌స్టు ఐదో తేదీన జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ)
ఆగ‌స్టు ఆరో తేదీన సోష‌ల్ స్ట‌డీస్
ఆగ‌స్టు ఎనిమిదో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఆగ‌స్టు పదో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments