Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు

Advertiesment
Telangana
తెలంగాణ రాష్ట్రంలో గురువారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల భవన సముదాయంలో ఉన్న విద్యాశాఖ కార్యాలయంలో విద్యామంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. 
 
విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, www.ntnews.com అనే వెబ్ సైట్‌లలో చూడొచ్చు.
 
కాగా, మే నెల 23వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 5,08,143 మంది రెగ్యులర్ విద్యార్థులు, 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాయగా, 167 మంది ప్రైవేట్ విద్యార్థులకు 87 మంది రాశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53 -2 నిమిషాలు ఆలస్యంగా