Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత ఆలస్యంకానున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (12:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యంకానున్నాయి. నిజానికి ఫలితాలను ఈ వారమే విడుదల చేయాల్సివుంది. కానీ, అనివార్య కారణాలతో ఈ ఫలితాలను ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. 
 
ఎంసెట్ విభాగంలో అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 94,476 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. గత నెల 30, 31 తేదీల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 80,575 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,56,812 మంది హాజరయ్యారు. 
 
ఇకపోతే, ఈ ఫలితాల విడుదల జాప్యంపై తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను వచ్చే వారం విడుదల చేస్తామన్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను జేఈఈ కౌన్సెలింగ్‌తో అనుసంధానం చేసినట్టు చెప్పారు. కాబట్టి ఇది ఇక్టోబరు చివరివారం వరకు జరుగుతుందని చెప్పారు. నవంబరు ఒకటో తేదీ నుంచి క్లాస్ వర్క్ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments