Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

ఏపీలో ఈఏపీసెట్‌ ఫలితాలను రిలీజ్ చేసిన మంత్రి బొత్స

Advertiesment
botsa
, మంగళవారం, 26 జులై 2022 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు.
 
ఇంజినీరింగ్‌, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 3,01,172 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్‌ పరీక్ష 1,94,752, వ్యవసాయ కోర్సు పరీక్ష 87,744 మంది రాశారు. 
 
ఇంజినీరింగ్‌లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. వ్యవసాయ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ఈ ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ప్రవేశాలకు ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేదు. 
 
ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మార్కులు, ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రవేశాలు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా 35 శాతం సీట్లు ఈసారి ప్రభుత్వమే భర్తీ చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా