Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిధులు ఉంటే కదా రోడ్లకు రిపేర్లు చేసేది: మంత్రి గుమ్మనూరు జయరాం

gummanur jayaram
, సోమవారం, 25 జులై 2022 (17:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. గత మూడేళ్లుగా కొత్త రోడ్డు నిర్మించడం సంగతి దేవుడెరుగ.. కనీసం రోడ్డుపై పడిన గుంతలను కూడా పూడ్చలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇది విపక్ష పార్టీలకు మంతి విమర్శనాస్త్రంగా లభించింది. 
 
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఈ రోడ్ల దుస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అయ్యాయి. నిధులు లేకపోవడం వల్లే రోడ్లు వేయలేకపోతున్నామన్నారు. 
 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు వేయలేదన్నారు. 
 
ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పాడైపోయాయని గుర్తు చేసిన ఆయన వచ్చే ఆగస్టు నెలలో రూ.2 వేల కోట్లు నిధులు వస్తాయని ముఖ్యమంత్రి జగనన్న చెప్పారని, నిధులు రాగానే ఆగస్టు 15వ తేదీ తర్వాత రోడ్లు రిపేర్లకు సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాలిద్వారా మంకీపాక్స్ వైరస్ సోకుతుందా?