Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లో బాంబు పేలుళ్లు - 8 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (12:14 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోమారు బాంబుల మోతతో దద్ధరిల్లిపోయింది. కాబూల్‌లోని అత్యంత రద్దీగా ఉండ షాపింగ్ వీధిలో శక్తిమంతమైన బాంబు పేలింది. దీంతో ఎనిమిది మంది మరణించగా మరో 22 మంది గాయపడ్డారు. ఈ క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
కాగా, దేశంలో మైనార్టీలైన షియా ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు కలుసుకునే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పైగా, ఈ బాంబు దాడికి తాము నైతిక బాధ్యత వహిస్తున్నట్టు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన సున్ని ముస్లిం గ్రూపు అధికారిక ప్రకటన చేసింది. 
 
ఈ పేలుళ్ళలో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, శుక్రవారం కాబూల్‌లో జరిగిన బాంబు దాడిలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మరో 18 మంది గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments