తెలంగాణాలో ఎడ్‌ సెట్ షెడ్యూల్ విడుదల

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (09:56 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్ నోటిఫికేషన్‌ను తాజాగా జారీచేసింది. వచ్చే జూలై 26, 27 తేదీల్లో ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 220 బీఈడీ కాలేజీల్లోని 19600 సీట్ల భర్తీ కోసం ఈ ఎడ్ సెట్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఇతర రిజర్వేషన్‌ విభాగాలకు చెందిన విద్యార్థులకు 40 శాతం మార్కులు సరిపోతాయి. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరుకావొచ్చు. 
 
అయితే, మెడిసిన్, బిఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసేవారు మాత్రం ఈ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షలు రాయడానికి వీల్లేదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే వీరిని అనర్హులుగా పేర్కొంది. ఈ పరీక్షను తెలంగాణాలోని వివిధ ప్రాంతాలతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపిక చేసిన సెంటర్లలో నిర్వహిస్తారు. 
 
ఈ ఎడ్ సెట్ పరీక్షకు ఈ నెల 7వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, ఇతర కేటగిరీలవారు రూ.650 చొప్పున చెల్లించాల్సివుంటుంది. రూ.250 అపరాధంతో జూలై ఒకటో తేదీ వరకు, రూ.500 అపరాధంతో జూలై 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించినట్టు తెలంగాణ ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments