Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వింత.. ఒక వీధికి 2 జిల్లా, 2 మండలాలు, 2 అసెంబ్లీ స్థానాలు...

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (09:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని విపక్ష నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ప్రజల మనోభావాలకు ఏమాత్రం విలువ నివ్వకుండా ఈ జిల్లాల విభజన జరిగిందంటూ విమర్శలు వెల్లువెత్తినా ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా 13 జిల్లాలను ఇపుడు 26 జిల్లాలుగా చేశారు. అయితే, ఈ జిల్లాల ఏర్పాటుతో వింతలు, విశేషలు వెలుగులోకి వస్తున్నాయి. 

 
ఈ కొత్త జిల్లాల సరిహద్దులు, పాలన సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక వీధికి ఇపుడు రెండు నియోజకవర్గాలు, రెండు మండలాలు, రెండు జిల్లాలు సరిహద్దులుగా మారింది. జిల్లాల పునర్విభజన కారణంగా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్ళపూడి మండలంలోని తాళ్ళపూడి, పోలవరం నియోజకవర్గంలోని గూటాల పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మిదేవిపేట గ్రామాలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్ళిపోయాయి. 

 
ఇందులో తాడిపూడిలోని ఓ వీధి కుడివైపు భాగం తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లగా, ఎడమవైపున ఉన్న మహాలక్ష్మిదేవిపేట ఏలూరు జిల్లాలోకి వెళ్లింది. ఫలితంగా ఒకే వీధి ప్రజలు రెండు వేర్వేరు జిల్లాలు, వేర్వేరు మండలాలు, వేర్వేరు నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు అయింది. జిల్లాల అశాస్త్రీయ విభజనకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments