Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోంగార్డు పోస్టులు.. నెలకు రూ.2800 వేతనం.. పీజీ పట్టభద్రుల దరఖాస్తు

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (17:00 IST)
దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా, గతంలో ఎన్నడూ లేనంతగా 2017-18 సంవత్సరంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరింది. ఈ సంవత్సరంలోనే నిరుద్యోగం 6.1 శాతానికి పెరిగినట్టు అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి. ఈ సర్వేలను రుజువు చేసేలా ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో స్వీపర్ పోస్టులకు బీటెక్, ఎంటెక్ పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, తాజాగా హోంగార్డు పోస్టులకు పీజీ పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే జరిగింది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో 56 హోం గార్డుల పోస్టులకు ఇటీవల దరఖాస్తులను ఉచితంగా ఇచ్చారు. ఈ దరఖాస్తులను పూర్తి చేసి ఈనెల 15వ తేదీలోపు సమర్పించాల్సి వుంది. ఇప్పటికే 6400 మంది నిరుద్యోగులు దరఖాస్తులు పూర్తి చేసి తిరిగి ఇచ్చేశారు. వీటిని పరిశీలించిన అధికారులు విస్తుపోయారు. వీరిలో వందల మంది అభ్యర్థుల విద్యార్హత పీజీగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 
 
ఇంతకీ ఈ హోంగార్డుకు ఇచ్చే నెలవేతనం కేవలం రూ.2800 మాత్రమే. అదీ కూడా నెలకు ఐదు రోజులు మాత్రమే పని కల్పిస్తారు. ఒక్కో రోజుకు రూ.560 చొప్పున వేతనం చెల్లిస్తారు. అయినప్పటికీ ఏదో ఒక ఉద్యోగం, ఎంతోకొంత వేతనం అన్న రీతిలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దండెత్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments