Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యుజి 2024లో టాప్ స్కోరర్‌గా నిలిచిన నెల్లూరుకు చెందిన ఆకాష్ ఎడ్యుకేషనల్ విద్యార్థి

ఐవీఆర్
శనివారం, 8 జూన్ 2024 (21:55 IST)
టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్), ప్రతిష్టాత్మకమైన నీట్ యుజి 2024 పరీక్షలో నెల్లూరుకు చెందిన విద్యార్థి పడాల సుహాస్ అత్యుత్తమ ప్రదర్శన చేశారని సగర్వంగా వెల్లడించింది. ఈ విద్యార్థి 720కు గానూ 715 స్కోర్ చేసాడు. ప్రతిష్టాత్మకమైన నీట్ యుజి 2024 పరీక్షలలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్ ) 162 సాధించాడు. నెల్లూరు నగరంలో టాపర్‌గా కూడా సుహాస్ నిలిచాడు. ఈ అద్భుతమైన ఫీట్ అతని కృషి, అంకితభావం, ఏఈఎస్ఎల్ అందించిన అధిక-నాణ్యత కలిగిన కోచింగ్‌కు నిదర్శనం. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.
 
పడాల సుహాస్ 720కు గానూ 715 స్కోర్ చేయడం ద్వారా ఆల్ ఇండియా ర్యాంక్(ఏఐఆర్) 162 సాధించాడు. అతని అసాధారణమైన ప్రదర్శన అతని అంకితభావం, కృషిని మాత్రమే కాకుండా ఏఈఎస్ఎల్ యొక్క సమగ్ర కోచింగ్ ప్రోగ్రామ్ యొక్క ప్రభావాన్ని కూడా హైలైట్ చేస్తుంది. సుహాస్ సాధించిన ఘనత ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. సబ్జెక్ట్‌లపై అతని లోతైన అవగాహన, ఒత్తిడిలో రాణించగల అతని సామర్థ్యాన్ని ప్రదర్శస్తుంది. అతని విజయగాథ ప్రపంచవ్యాప్తంగా కష్టతరమైన ప్రవేశ పరీక్షలలో ఒకదానిని ఛేదించాలనే లక్ష్యంతో అనేక మంది ఔత్సాహిక విద్యార్థులకు ప్రేరణగా పనిచేస్తుంది.
 
పడాల సుహాస్ నీట్ కోసం సిద్ధం కావడానికి ఏఈఎస్ఎల్ యొక్క తరగతి గది ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నాడు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలలో ఒకటిగా నీట్ పరిగణించబడుతుంది. తన అద్భుతమైన విజయానికి కాన్సెప్ట్‌ల పట్ల మెరుగైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన అధ్యయన షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించడం వల్లనే సాధ్యమైనదని అతను వెల్లడించాడు. "ఆకాష్ నాకు రెండు విధాలా సహాయం చేసినందుకు నేను  కృతజ్ఞులను చెబుతున్నాను. ఏఈఎస్ఎల్ కంటెంట్, కోచింగ్ లేకుండా, తక్కువ సమయంలో వివిధ సబ్జెక్టులలో అనేక కాన్సెప్టులను గ్రహించలేను" అని తెలిపాడు.
 
అసాధారణ విజయాన్ని సాధించినందుకు సుహాస్‌ను అభినందించిన, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) చీఫ్ అకడమిక్, బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, "సుహాస్ సాధించిన ఆదర్శప్రాయమైన ఫీట్‌కి అతనిని అభినందిస్తున్నాము. 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ 2024కి హాజరయ్యారు. అతను సాధించిన విజయం, అతని కృషి, అంకితభావంతో పాటు తల్లిదండ్రుల మద్దతు గురించి ఎంతో చెబుతుంది. భవిష్యత్‌లో అతను మరిన్ని శిఖరాలను అధిరోహించాలని అభిలషిస్తున్నాను" అని అన్నారు.
 
అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ (MBBS), డెంటల్ (BDS), ఆయుష్ (BAMS, BUMS, BHMS, మొదలైనవి) కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులకు భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో, విదేశాలలో ప్రాథమిక వైద్య అర్హతను పొందాలనుకునే వారికి అర్హత పరీక్షగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి సంవత్సరం నీట్ నిర్వహిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments