Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం... గడువు మార్చి 12 వరకు..

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (09:03 IST)
జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్షలకు ఎట్టకేలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. బుధవారం నుంచి ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తు గడువును మార్చి 12వ తేదీ వరకు ఇచ్చారు. జేఈఈ మెయిన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 12వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవ్చని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్.టి.ఏ) తెలిపింది. 
 
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ తుది విడత పరీక్షల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు ప్రత్యేకంగా ఒక లింకును కూడా అందుబాటులోకి తెచ్చింది. 
 
గతంలో ప్రకటించిన ప్రకారం అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నప్పటికీ ఎన్.టి.ఏ నుంచి ఎలాంటి స్పందన లేకుండా ఉన్నది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఎన్.టి.ఏ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తంమీద వారం రోజుల ఆలస్యంగా ఈ ప్రక్రియను ప్రారంభించింది.
 
కాగా, జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. అలాగే, ఏప్రిల్ 13, 15 తేదీలను ఎన్.టి.ఏ రిజర్వుడేలు ఉంచింది. ఈ పరీక్షల తర్వాత ఉత్తమ స్కోరును తీసుకుని విద్యార్థులకు ర్యాంకుల జాబితాను ప్రకటిస్తారు. ఈ ర్యాంకుల ఆధారంగా జాతీయ స్థాయిలో ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments