Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిమ్స్ పీజీ పరీక్షల్లో టాపర్‌గా గుంటూరు వైద్యురాలు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (11:02 IST)
అఖిల భారత వైద్య విజ్ఞాన మండలి (ఎయిమ్స్) నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షల్లో గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసించిన వినీత, జూన్ 11న నిర్వహించిన పరీక్షల్లో తొలి స్థానంలో నిలిచారు. వినీతతో పాటు మరో ఆరుగురికి కూడా నూటికి నూరు మార్కులూ వచ్చాయి.
 
ఎయిమ్స్ నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో పీజీ పరీక్షలు ఒకటి. ఈ పరీక్షల్లో టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ వినీత చెప్పుకొచ్చారు. తాను పీజీలో జనరల్ మెడిసిన్‌ను ఎంచుకోనున్నానని, గత సంవత్సరం డిసెంబర్‌లోనే తన ఎంబీబీఎస్ పూర్తయిందని తెలిపారు. 
 
ఈ పరీక్షల కోసం కష్టపడ్డానని, ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. తన పీజీ విద్యను ఢిల్లీ ఎయిమ్స్ లేదా చండీగఢ్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో గానీ పూర్తి చేస్తానని ఆమె అంటున్నారు. 
 
'పీజీలో ప్రవేశం కోసం ఆరు నెలల క్రితమే ప్రిపరేషన్‌ను మొదలు పెట్టాను. ఎంబీబీఎస్ కోర్సులోని స్టడీ మెటీరియల్సును మరోసారి చదువుకున్నాను. ఓ యాప్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు తీసుకుని పరీక్షకు హాజరయ్యాను' అని వివరించారు. 
 
కాగా, పీజీ ఎంట్రెన్స్‌లో మొత్తం 4,335 మంది ర్యాంకులను అందుకున్నారు. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చదువుతున్న 74 మందికి ర్యాంకులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిమ్స్‌ల్లో చదువుతున్న 29 మందికి వందకు వంద మార్కులు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments