Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిమ్స్ పీజీ పరీక్షల్లో టాపర్‌గా గుంటూరు వైద్యురాలు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (11:02 IST)
అఖిల భారత వైద్య విజ్ఞాన మండలి (ఎయిమ్స్) నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షల్లో గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసించిన వినీత, జూన్ 11న నిర్వహించిన పరీక్షల్లో తొలి స్థానంలో నిలిచారు. వినీతతో పాటు మరో ఆరుగురికి కూడా నూటికి నూరు మార్కులూ వచ్చాయి.
 
ఎయిమ్స్ నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో పీజీ పరీక్షలు ఒకటి. ఈ పరీక్షల్లో టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ వినీత చెప్పుకొచ్చారు. తాను పీజీలో జనరల్ మెడిసిన్‌ను ఎంచుకోనున్నానని, గత సంవత్సరం డిసెంబర్‌లోనే తన ఎంబీబీఎస్ పూర్తయిందని తెలిపారు. 
 
ఈ పరీక్షల కోసం కష్టపడ్డానని, ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. తన పీజీ విద్యను ఢిల్లీ ఎయిమ్స్ లేదా చండీగఢ్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో గానీ పూర్తి చేస్తానని ఆమె అంటున్నారు. 
 
'పీజీలో ప్రవేశం కోసం ఆరు నెలల క్రితమే ప్రిపరేషన్‌ను మొదలు పెట్టాను. ఎంబీబీఎస్ కోర్సులోని స్టడీ మెటీరియల్సును మరోసారి చదువుకున్నాను. ఓ యాప్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు తీసుకుని పరీక్షకు హాజరయ్యాను' అని వివరించారు. 
 
కాగా, పీజీ ఎంట్రెన్స్‌లో మొత్తం 4,335 మంది ర్యాంకులను అందుకున్నారు. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చదువుతున్న 74 మందికి ర్యాంకులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిమ్స్‌ల్లో చదువుతున్న 29 మందికి వందకు వంద మార్కులు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments