Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై కేంద్రంగా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (14:48 IST)
అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలోని వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 
 
ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ముంబై, పుణె, నాగ్‌పూర్‌, భుసావల్‌, షోలాపూర్‌ డివిజన్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
 
మొత్తం ఖాళీలు: 2532 
అర్హత: పదో తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదా దానికి సమానమైన (10 +2 విధానంలో) ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎన్‌టీవీసీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. అదేవిధంగా 15 నుంచి 24 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
 
ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 6
అప్లికేషన్లకు చివరితేదీ: మార్చి 5

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments