నేడు ఏపీ ఇంటర్ ఫలితాల వెల్లడి - గ్రేడింగ్ విధానం రద్దు

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (10:21 IST)
ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలకానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మొదటి, రెండో సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. 
 
కాగా, రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలు విడుదల చేస్తూ వస్తున్నారు. కానీ, ఈ యేడాది ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఈ సారి సబ్జెక్టుల వారీ మార్కులతోనే ఫస్టియర్‌ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
ఇకపోతే, ఇంటర్ ద్వితీయ రెగ్యులర్‌ అభ్యర్థుల ఫలితాలను మాత్రం సబ్జెక్టుల వారీ గ్రేడ్‌ పాయింట్లతో ఇస్తారు. వారి ఫస్టియర్‌ ఫలితాలను గత యేడాది గ్రేడ్‌ పాయింట్లతో ఇచ్చినందున ఇప్పుడు కూడా గ్రేడ్‌ పాయింట్‌లు ఇస్తున్నారు. 
 
అలాగే, షార్ట్‌ మార్కుల మెమోలను ఇంటర్‌ బోర్డు bie.ap.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 15 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 
 
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా క్లౌడ్‌ సర్వీస్‌ ద్వారా ముందస్తుగా రిజిస్టర్‌ చేసుకున్న వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉండేలా ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. ఫలితాలు అందుబాటులో ఉండే కొన్ని   వెబ్‌సైటు https://bie.ap.gov.in, https://results.bie.ap.gov.in 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం